Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Martyrs final rites: వీర మరణం పొందిన జవానుకు అంత్యక్రియలు

Martyrs final rites: వీర మరణం పొందిన జవానుకు అంత్యక్రియలు

పూర్తి ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు

భారత సైన్యంలో హవాల్దర్ గా పనిచేస్తూ వీర మరణం పొందిన పిట్టా శ్రీనివాస్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కే. గంగవరం మండలం పేకేరు భీమ్ నగర్ కు చెందిన పిట్టా శ్రీనివాస్ (40 సంవత్సరాలు) చైనా బోర్డర్ వద్ద టెర్రరిస్ట్ అటాక్ తో వీర మరణం పొందిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పేకేరులోని ఆయన స్వగ్రామంలో పూర్తి ప్రభుత్వ, అధికార లాంచనాలతో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొని హవాల్దర్ శ్రీనివాస్ మృతదేహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం, ఆర్మీ, నేవీ అధికారులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad