Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala Collector: ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Nandyala Collector: ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

'నవరత్నాలు' ప్రతిబింభించేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకత్తించే విధంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, బ్యాక్ డ్రాప్, విఐపి సీటింగ్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ చూపాలని ఆర్డీఓ, పోలీసు అధికారులను ఆదేశించారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

‘నవరత్నాల’ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింభించేలా వ్యవసాయం, డిఆర్డిఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా తదితర అన్ని సంక్షేమ శాఖలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై విఐపి సందేశ బుక్ లెట్ ను సిద్ధం చేయాలని డిఐపిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి అధికారి తమ కార్యాలయం సిబ్బందితో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గత స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తలెత్తిన సూక్ష్మలోపాలను సైతం దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వేడుకల నిర్వహణపై సీరియస్ గా తీసుకోవాలని జిల్లాధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులకు అప్పగించిన విధులను చివరి వరకు వుండకుండా ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆహ్వాన పత్రికలను ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే పంపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. అత్యంత ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల జారీకి ఈ నెల 10వ తేదీలోగా జాబితా పంపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి ఇతర జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News