Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: సర్పంచుల విధులు-నిధులపై సిఎంను కలుద్దాం రండి

Nandyala: సర్పంచుల విధులు-నిధులపై సిఎంను కలుద్దాం రండి

పార్టీలకతీతంగా సర్పంచులంతా రండి

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా సర్పంచులందరూ పార్టీలకు అతీతంగా కదలి రావాలని, ఉమ్మడి కర్నూలు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసులు యాదవ్ కోరారు. గతంలో సర్పంచులు కలిసి కలెక్టర్ కు సర్పంచుల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడమైంది. అయితే ఆవినతిపత్రంనకు ఎటువంటి సమాచారం కలెక్టర్ తెలుపలేదు. అందుకొరకై డోన్ కు రాబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, సర్పంచుల విధులు, నిధులపై, సర్పంచులకున్న బాధలను, సర్పంచుల సమస్యలను విన్నవించు కుందామని, అందుకై ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న సర్పంచులందరూ పార్టీలకతీతంగా కదలి రావలయునని శ్రీనివాసులు యాదవ్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News