Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ఎంపీ ల్యాడ్స్ పనులు మే15 తేదీలోగా పూర్తి చేయండి

Nandyala: ఎంపీ ల్యాడ్స్ పనులు మే15 తేదీలోగా పూర్తి చేయండి

నంద్యాల జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ కింద పనులు మంజూరై ప్రగతిలో ఉన్న పనులను వచ్చేనెల 15 తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ ల్యాడ్స్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ కింద 2019-20 నుండి 2022-23 వరకు రహదారులు, ప్రహరీ గోడలు, త్రాగునీటి సరఫరా తదితర పనులు మంజూరై ప్రగతిలో ఉన్న పనులను మే నెల 15 తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాదాపు 12 కోట్ల రూపాయలతో చేపట్టిన 110 పనుల్లో ఇప్పటివరకు 52 పనులు పూర్తి అయ్యాయన్నారు. వివిధ నిర్మాణ దశల్లో 25 పనుల ప్రగతిపై సంబంధిత అధికారుల నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రగతిలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి వచ్చే నెల 15 తేదీలోగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంబందింత అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి గోపాలకృష్ణ, రాజ్ పంచాయతీరాజ్ ఎస్ఈ రామ్మోహన్ , ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News