తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ బీఫామ్ ను అందుకున్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ బీఫామ్ ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరి సహకారం, సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో నంద్యాల కోటపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. 20 ఏళ్ల కల సాకారం చేసి, గెలుపును కానుకగా ఇస్తామని అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ధీమా వ్యక్తం చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/04/479e7721-dd5a-4796-bf40-869001abd510-1024x682.jpg)