Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు

Panyam: వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు

గౌరు చరిత ఆధ్వర్యంలో..

పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం రేమడూరు గ్రామనికీ చెందిన వైసిపి ఉప సర్పంచ్ చంద్ర, వార్డ్ మెంబర్లు నాగరాజుతో పాటు 100 కుటుంబాలు మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు గౌరు కుటుంబం. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి చేద్దామని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం కేంద్రంలోని టిడిపి కార్యాలయం ఆవరణలో గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు,అర్బన్ వార్డ్ లలో ఉన్న బిసి గౌడు సోదరులు నిరాహార దీక్ష కూర్చొని, గౌడు సోదరులు కల్లు కుండలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు గౌరు చరిత రెడ్డి.


ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పాణ్యం మండల అధ్యక్షుడు జయారామి రెడ్డి, గౌడ్ సంఘం కన్వీనర్ నాగేశ్వర గౌడ్, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్,మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ,పుల్లయ్య గౌడ్, కోటేష్ గౌడ్,రాజ గౌడ్,భాస్కర్ గౌడ్,సంతోష్ గౌడ్,ఈశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News