Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు గొప్ప వరం

Pathikonda: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు గొప్ప వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు పెద్దవరం అని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. పత్తికొండలో స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన పదిలక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నలుగురు జి ఎర్రగుడి గ్రామానికి చెందిన షర్ఫున్ బి 6,00,000, రూపాయలు, కరెంట్ షాక్ తో మూడు సంవత్సర క్రితం మృతి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు సుగాలి రంగడు నాయక్ కి 2,00,000, రూపాయలు, వివిధ కారణాలతో మృతి చెందిన సూదేపల్లె లొడ్డ రాజ్ కుమార్ 1,00,000,రూపాయలు,బోగోలు రాజేష్ కు 1,00,000,రూపాయలు మొత్తం 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుంది. అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించినట్టు తెలిపారు.పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసాన్ని కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 1000కి పైగా రోగాలను చేర్చారు. మిగతా రోగాలకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందిస్తామన్రునా. చెక్ ను అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News