Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: పకడ్బందీగా సీఎం టూర్ కు ఏర్పాట్లు

Pathikonda: పకడ్బందీగా సీఎం టూర్ కు ఏర్పాట్లు

ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండలో ‘రైతు భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశించారు. పత్తికొండ పట్టణంలో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు బహిరంగ సభ ఏర్పాట్లు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో హెలిప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, దితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News