Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Sreedevamma: 'జగనన్న ఆణిముత్యాల'కు నగదు ప్రోత్సాహం అందజేత

Sreedevamma: ‘జగనన్న ఆణిముత్యాల’కు నగదు ప్రోత్సాహం అందజేత

ఇవన్నీ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదు

ప్రభుత్వ స్కూళ్లలో చదివి నియోజకవర్గస్థాయిలో మంచి స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పత్తికొండ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్యాలకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ చేతుల మీదుగా విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించి నగదు ప్రోత్సాహం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు పనులు కింద ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూలుకు దీటుగా ఎదుర్కునే విధంగా తయారుచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా మొదలుపెట్టి, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించడం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిజి ప్రభాకర్,నవీన, కిరణ్,శివప్రసాద్, పూజిత,ఐశ్వర్య, మసిపోగు శృతిలను సన్మానించారు. ఎంపిపి నారాయణ దాసు, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, సర్పంచ్ కొమ్ము దీపిక, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎంఈఓ మస్తాన్వలి,జై చంద్ర రెడ్డి, శ్రీరాములు, ఎస్టీ సెల్ భాస్కర్ నాయక్, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad