Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అతిరుద్ర యాగం

Srisailam: గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అతిరుద్ర యాగం

శ్రీశైలం మహాక్షేత్రంలోని గణపతి ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో అతిరుద్ర యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి 27 వరకు 11 రోజులపాటు జరుగనున్న యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా జరిగేందుకు సంకల్ప పూజ నిర్వహించారు. ఈ అతిరుద్ర యాగంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. అతిరుద్రానికి హాజరయ్యే భక్తులందరికీ అన్నప్రసాదాలను అందించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రోజూ కనీసం 10,000 మందికి తగ్గకుండా అన్నప్రసాదాలను అందిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad