Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం జగద్గురు 'జన జాగృతి'లో కర్నాటక సీఎం

Srisailam: శ్రీశైలం జగద్గురు ‘జన జాగృతి’లో కర్నాటక సీఎం

శ్రీశైలమహాక్షేత్రానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిపాడ్ నుంచి వీరిద్దరూ గుడికి రోడ్డు మీదుగా వచ్చారు. శ్రీశైలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఇద్దరు సీఎంలూ పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలం టోల్‌గేట్ సమీపంలోని బసవేశ్వర వీరశైవ విద్యావరదాక్ సంఘ నిత్యాన్నదాన మందిరాన్ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ దాదాపు 400 గదులతో భక్తులకు వసతి ఏర్పాటు కానుంది. కంబి మండప స్థలంలో నిర్మించనున్న సంస్కృత పాఠశాల, వేద పాఠశాల, వైద్యశాల భవనాలను పరిశీలించారు. అనంతరం జన జాగృతి కార్యక్రమంలో పాల్గొని జాతిని ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News