Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలంలో చిన్నపిల్లలకి సామూహిక భోగిపండ్లు

Srisailam: శ్రీశైలంలో చిన్నపిల్లలకి సామూహిక భోగిపండ్లు

శ్రీశైలం మహా క్షేత్రంలో భోగి పండుగను పురస్కరించుకుని దేవస్థానం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు భోగింపండ్లు వేసి, వారిని ఆశీర్వదించారు. 50 మంది పైగా చిన్నారులకు ఆలయప్రాంగణంలో భోగిపండ్లు పోశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ సామూహికంగా భోగింపడ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ భోగిపండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ఆలయ అర్చకులు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad