Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Thikkareddy: రాజకీయ కక్షతోనే బాబుపై కేసులు

Thikkareddy: రాజకీయ కక్షతోనే బాబుపై కేసులు

మంత్రాలయంలో తిక్కారెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు రాజకీయ కక్షతోనే తప్ప చంద్రబాబు ఎలాంటి నేరం చేయలేదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు…. మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ నియోజకవర్గం లీగల్ సెల్ నాయకులు అధ్యక్షులు బాబురావు , జగన్నాథ్ రెడ్డి గురు ప్రసాద్ , కోసిగి వీరేష్ , తదితర న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు ..ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన కేసుకు జగన్ ప్రభుత్వం ఆధారాలు చూపించాలని సవాలు విసిరారు, చంద్రబాబు, లోకేష్ కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే రాజకీయ కక్షతో కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు… రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడుతున్నారని నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు …ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, కోసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ , వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్ శెట్టి, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, ఐటీడీపీ సాల్మన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News