Friday, May 30, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో జగన్ దంపతులు

YS Jagan: రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో జగన్ దంపతులు

దివంగత మహానేత వైఎస్సార్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌(YS Jagan) దంపతులు పాల్గొన్నారు. సతీసమేతంగా విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన జగన్‌కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

మరోవైపు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోనూ రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. రాజారెడ్డి ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News