Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఇంటింటికి చంద్రబాబు మోసాలు కార్యక్రమం.. జగన్ కీలక నిర్ణయం

YS Jagan: ఇంటింటికి చంద్రబాబు మోసాలు కార్యక్రమం.. జగన్ కీలక నిర్ణయం


YS Jagan starts qr code campaign: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగారు. ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వంపై దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని ఆరోపించారు. గత వైసీసీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించామని తెలిపారు. అదే కూటమి ప్రభుత్వంలో కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం పాలన జరుగుతోందని విమర్శించారు.

- Advertisement -

ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తికావడంతో హనీమూన్‌ పీరియడ్‌ ముగిసిందన్నారు. ఇక నుంచి ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందే అని ఆదేశించారు. అందరినీ కలుపుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని విమర్శించారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నారని మండిపడ్డారు.

ఇందులో భాగంగా రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు పాటు నిర్వహిస్తాం అన్నారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఇందులో పాల్గొంటారన్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ తీసుకొస్తున్నామని.. ఈ కోడ్ స్కాన్ చేయగానే చంద్రబాబు ఇచ్చిన హామీలు వస్తాయని.. అంతేకాకుండా ప్రభుత్వం చేసిన పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయన్నారు. దీని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయిందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలని సూచనలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News