Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభSDT15: మెగా హీరోలని కాదని మరీ ఎన్టీఆర్ సాయం కోరిన సాయిధరమ్ తేజ్?

SDT15: మెగా హీరోలని కాదని మరీ ఎన్టీఆర్ సాయం కోరిన సాయిధరమ్ తేజ్?

- Advertisement -

SDT 15 : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ల క్రితం భారీ యాక్సిడెంట్ కి గురయి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పట్టింది తేజ్ కి. అప్పట్నుంచి అసలు మీడియా ముందుకు రాలేదు తేజ్. తాజాగా తన 15వ సినిమా టైటిల్ అనౌన్సమెంట్ సందర్భంగా 16 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు సాయిధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో BVSN ప్రసాద్, సుకుమార్ లు నిర్మాతలుగా సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఎన్టీఆర్ వాయిస్ తో చిన్న గ్లింప్స్ ఇస్తూ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. అజ్ఞానం భయానికి మూలం భయం మూఢనమ్మకానికి కారణం, ఆ నమ్మకమే నిజమైనప్పుడు ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు నిజాన్ని చూపించే మరో నేత్రం ఈ విరూపాక్ష అని ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు.

సాయిధరమ్ నటించిన 15వ చిత్రానికి విరూపాక్ష టైటిల్ ని ఖరారు చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడమే కాకుండా, కాన్సప్ట్ కూడా కొత్తగా ఉండటంతో, గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని 21 ఏప్రిల్ 2023న పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఇది సాయి ధరమ్ తేజ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News