Monday, May 20, 2024
Homeనేరాలు-ఘోరాలుBhimadevarapalli: ప్రాణం తీసిన అతివేగం

Bhimadevarapalli: ప్రాణం తీసిన అతివేగం

హుస్నాబాద్ వద్ద లారీ ప్రమాదం

ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన భీమదేవరపల్లి మండలం హుస్నాబాద్ రోడ్ చిట్యాల ఎల్లయ్య వ్యవసాయ బావి వద్ద జరిగింది. ముల్కనూర్ ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మోరే బుచ్చయ్య (55) రోజు మాదిరిగానే తన వ్యవసాయ భావి వద్ద పనులు ముగించుకొని తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా హుస్నాబాద్ రోడ్ వద్ద లారీ ఢీకొంది.

- Advertisement -

లారీ డ్రైవర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మోరే బుచ్చయ్యకి తలకి, కాళ్ళకి తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మోరే సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా అతివేగంగా, నిర్లక్ష్యంగా, రోడ్డుపై వాహనాలు నడిపినట్లైతే అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సాయిబాబు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News