Monday, November 17, 2025
Homeనేరాలు-ఘోరాలుChegunta: మహిళ ఆత్మహత్య

Chegunta: మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో..

చేగుంటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చేగుంట మండల కేంద్రంలో వంగ స్వాతి అలియాస్ మాధవికి 17 సంవత్సరాల క్రితం వంగ సత్యనారాయణతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఒక కూతురుండగా, గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని తెలుస్తోంది. దీంతో మనస్ఫర్దకు గురైన ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మాధవి తమ్ముడు రమేష్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad