Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుIbrahimpatnam: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాళ్ల వర్షం

Ibrahimpatnam: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాళ్ల వర్షం

మల్రెడ్డి, మంచిరెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య రాళ్ళ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీల భారీ ర్యాలీలు జరిగాయి.. ర్యాలీ వెళ్తుంటే ఒక పార్టీపై మరొక పార్టీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు విసుకురుకున్నారు.

- Advertisement -

ఇరుపార్టీల నాయకులకు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బిఆర్ఎస్ పార్టీ జెండాను కాంగ్రెస్ నాయకులపై, కాంగ్రెస్ పార్టీ జెండాను బిఆర్ఎస్ నాయకులపై విసురుకున్నారు. భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా, భారీ ర్యాలీతో బయల్దేరారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ర్యాలీ తీసే క్రమంలో రాళ్ళ వర్షం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకులపై పోలీసుల లాఠీ ఛార్జ్ జరిగింది, మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News