Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుThangallapalli: డ్రంక్ & డ్రైవ్ పై కఠిన చర్యలు

Thangallapalli: డ్రంక్ & డ్రైవ్ పై కఠిన చర్యలు

ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడిపితెే కఠిన చర్యలు తప్పవని తంగళ్లపల్లి ఎస్ఐ డి.సుధాకర్ హెచ్చరించారు. తంగళ్లపల్లి-సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టగా.. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని అన్నారు. సిరిసిల్లకి చెందిన నలుగురు, ఇబ్రహీం పూర్ కి చెందిన ఒకరిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహనాల తనిఖీలలో ఏఎసై చంద్రమౌళి, కానిస్టేబుల్ లు నరేందర్, సంపత్, రామ్మోహన్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad