Saturday, July 6, 2024
Homeనేరాలు-ఘోరాలుThirmalayapalem: వైన్ షాప్ వ్యక్తిగత సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదుపై ఏసీపీ విచారణ

Thirmalayapalem: వైన్ షాప్ వ్యక్తిగత సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదుపై ఏసీపీ విచారణ

తిరుమలాయపాలెం మండల పరిధిలోని వైన్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిపై ఎస్టీ ఎస్టీ కేసు నమోదు కాగా విచారణ నిమిత్తం రూరల్ ఏసిపి బస్వారెడ్డి మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో పిటిషన్ దారుడిని విచారించారు. వేదుల చెరువు గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటేశ్వర్లు పిండిప్రోలు గ్రామంలోని పాపాయిగూడెం స్టేజి వద్ద బెల్ట్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వైన్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది ఇటీవల కాలంలో బెల్ట్ షాపులో అక్రమ మద్యం విక్రయిస్తున్నావని షాపును చెక్ చేయాలని కోరగా, అతన్ని నిరాకరించడంతో దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నిమిత్తం గ్రామానికి చెందిన సోమనబోయిన మల్సూర్ చామకూరి శేఖర్ పై కేసు నమోదు కాగా రూరల్ ఏసిపి బస్వారెడ్డి విచారణ నిమిత్తం పిటిషన్ దారుడు ఎడ్ల వెంకటేశ్వర్లు సాక్షులను విచారించారు ఆయన వెంట తిరుమలాయపాలెం ఎస్సై వరాల శ్రీనివాస్ ఏ ఎస్ ఐ రాఘవయ్య కానిస్టేబుల్ హరికృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News