Sunday, September 8, 2024
HomeదైవంGolden Chariot to Srisailam Mallanna: శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం

Golden Chariot to Srisailam Mallanna: శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం

రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి

శ్రీశైలం మల్లన్నకు స్వర్ణ రథ సమర్పణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు వారు ఈ స్వర్ణరథాన్ని విరాళంగా సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమములో రాష్ట్ర గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు-దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ దంపతులు, స్థానిక గౌరవశాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ మఠం విరూపాక్షయ్యస్వామి, విజయలక్ష్మీ, డా. సి. కనకదుర్గ పాల్గొన్నారు.
ఆలయ రాజగోపురం ముందు స్వర్ణరథానికి సంప్రోక్షణ, ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమములో భాగంగానే రథాంగహోమం, రథాంగబలి తదితర కార్యక్రమాలను జరిపించారు. సంప్రోక్షణ ప్రారంభ పూజల తరువాత ఆలయ రాజగోపురం ముందుభాగం నుంచి నంది ఆలయం వరకు తిరిగి నంది ఆలయం నుంచి ఆలయ రాజగోపురం వరకు శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం జరిపించారు.
కాగా ఈ స్వర్ణరథోత్సవంలో నాదస్వరం, కోలాటం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అధికసంఖ్యలో భక్తులు, స్థానికులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News