Monday, October 7, 2024
HomeదైవంJadcharla: శ్రీ మహేశ్వరీ దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: శ్రీ మహేశ్వరీ దేవిగా బంగారు మైసమ్మ దేవత

చల్లగా చూడమ్మా..

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 5వ రోజు సోమవారం శ్రీ మహేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

గణపతి పూజ అనంతరం శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, శ్రీ దేవి నవరాత్రోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి శనగ గారెలు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఘనాతే విజయ్ కుమార్, గుండు చంద్ర శేఖర్, భక్తులు పోల రవీందర్ సుమతి దంపతులు, శ్రీనివాసులు సీత దంపతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News