Thursday, April 10, 2025
HomeదైవంUrukunda: ఉరుకుంద క్షేత్రంలో భక్తుల సందడి

Urukunda: ఉరుకుంద క్షేత్రంలో భక్తుల సందడి

శ్రావణ సందడితో కళకళలాడుతున్న ఈరన్న మందిరం

కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి (నరసింహ స్వామి) క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది.. స్వామి ఉత్సవాలలో భాగంగా శ్రావణమాసం రెండవ గురువారం భక్తుల రద్దీ నెలకొంది.. స్వామి విశిష్టవారాన్ని పురస్కరించుకొని స్వామికి ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, దీపారాధన, మహా మంగళారతి వంటి పూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు.

- Advertisement -

తుంగభద్ర దిగువ కాలువలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు, పిండివంటలతో స్వామికి నైవేద్యాన్ని సమర్పించి , తలనీలాలు అర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఆంధ్ర రాష్ట్రం నుండే కాక, తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు స్వామి దర్శనం కోసం తరలివచ్చారు.. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ నాగరాజు గౌడ్, ఆలయ ఈవో వాణి, పాలకమండలి సభ్యులు ,ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి సీఐ ఎరిషావలి ఆధ్వర్యంలో, కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. భక్తుల సౌకర్యార్థం ఆంధ్ర కర్ణాటక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఏర్పాటు చేశారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News