వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్న సందిగ్ధతకు శృంగేరీ శంకర మఠం తెరదించింది. ఈనెల 18న గణేష్ చతుర్థి పండుగను జరుపుకోవాలని స్పష్టతనిస్తూ ప్రకటన జారీచేసింది శృంగేరీ పీఠం. కాగా కొందరు ఈనెల 18న పండుగ జరుపుకుంటుండగా మరికొందరు 19వ తేదీన జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో అసలు పండగ ఎప్పుడన్నది పెద్ద సందేహంగా మారింది.