Saturday, February 22, 2025
Homeఫీచర్స్Big Train: ఇది అనకొండ కాదు.. గూడ్స్ రైలు

Big Train: ఇది అనకొండ కాదు.. గూడ్స్ రైలు

కోట్లాది జనాలను నిత్యం వారి గమ్యస్థానాలకు చేర్చటంలో భారతీయ రైల్వే సంస్థలు(Indian Railways) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అయితే మనం ప్రయాణించే రైలుకు సాధారణంగా 15-20 లేదా అంతకన్నా తక్కువ బోగీలుంటాయి. ఇంకా గూడ్స్ రైలుకు అయితే 25 లేదా 50 బోగీలు ఉండచ్చు కానీ ఇక్కడ ఈ గూడ్స్ రైలుకు మాత్రం 50 బోగీలు కాదు ఉన్నది ఏకంగా 295 బోగీలున్నాయి. చూసేవారందరూ వామ్మో ఏంటి ఇంత పెద్ద రైలా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ భారీ అనకొండ ఎక్కడి నుంచి వచ్చి.. ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి.

- Advertisement -

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు పేరే సూపర్ వాసుకి. ఈ భారీ అనకొండను లాగేందుకు 6 ఇంజిన్‌లు పని చేస్తాయి.

రైలు పొడవు 3.5 కిలోమీటర్లు

ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు. ఈ రైలుకు 15-20 కాదు ఏకంగా 295 కోచ్‌లు ఉన్నాయి. ఇక ఆ కోచ్‌లను లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్లు పని చేస్తాయి. ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ సూపర్ వాసుకి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.

వాసుకి సర్పం
ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. దేవతులు, రాక్షసుల మధ్య సాగరాన్ని మథించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు, అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News