Sunday, November 16, 2025
Homeగ్యాలరీEli Lilly: సీఎం రేవంత్‌తో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రానికి మరో రూ.9...

Eli Lilly: సీఎం రేవంత్‌తో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రానికి మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడి

Eli Lilly Representatives Hold Meeting with Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో ఐసీసీసీలో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏకంగా రూ. 9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ అంగీకరించింది. దీంతో, గ్లోబల్‌ సిటీ హైదరాబాద్‌ శిగలో మరో పెద్ద సంస్థ చేరింది.

ఈ భేటీలో మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎలి లిల్లి సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో రూ. 9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలి లిల్లీ సంస్థ తన అంగీకారం తెలిపింది. ఈ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో రూ..9వేల కోట్ల పెట్డుబడులకు ఎలి లిల్లీ సంస్థ తన అంగీకారం తెలుపడాన్ని అభినందించారు.
తెలంగాణపైన నమ్మకం వచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని..హైదరాబాద్ గ్లోబల్ సిటీ గా ఎదిగిందని..పరిశ్రమలు పెట్టే వారికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1965లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ కి ఐడీపీఎల్ తీసుకు రావడం ద్వారా నగరం ఫార్మా హబ్ కేంద్రంగా మారిందన్నారు.
హైదరాబాద్ లో నేడు అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయని..40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ లు హైదరాబాద్ లోనే ఉత్పత్తి అయ్యాయన్నారు. ఫార్మా పాలసీ ని మా ప్రభుత్వం మరింత ముందుకు తీసుకు వెళ్తుందని తెలిపారు.
జినోమ్ వ్యాలీ లో ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం అని, జినోమ్ వ్యాలీకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అందిస్తాం అని వెల్లడించారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం అని, ఫార్మ్ కు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారని తెలిపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad