కొవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత వివిధ దేశాల్లో (భారత్ మినహా) టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
కొవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత వివిధ దేశాల్లో (భారత్ మినహా) టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కొవిడ్-19 టీకా దుష్ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక డాటా సేకరించింది. ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్.. పేరుతో కొవిడ్ టీకాల పనితీరును మదింపు చేసింది. భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది పేషెంట్ల నుంచి డాటాను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్టు తెలిసింది. ఎంఆర్ఎన్ఏ కొవిడ్ టీకాలు తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహా టీకాలే భారత్లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/maxresdefault-6-1024x576.jpg)