ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) కు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
యువతకు ఉపాధి హామీ
యువతకు ఉపాధి హామీ, ‘మహిళా సమ్మాన్ యోజన’, వృద్ధులకు ఉచిత వైద్యంతో సహా పార్టీ కట్టుబాట్లను మేనిఫెస్టో వివరించింది. తమ పార్టీని తిరిగి ఎన్నుకుంటే స్టూడెంట్స్ కి ఉచిత బస్సు ప్రయాణాన్ని మరియు మెట్రో ఛార్జీలలో 50 శాతం తగ్గింపును కూడా హామీ ఇస్తుందన్నారు.
నెలవారీ భత్యం రూ.2,100
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తమకు మళ్లీ అధికారం కట్టబెడితే మహిళలకు నెలవారీ భత్యం రూ. 2,100 అందిస్తానని తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. మరో అవకాశం ఇస్తే వచ్చే 5 ఏళ్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడం చేస్తామన్నారు. యమునా నదిని శుభ్రప రచడం, రోడ్లను మెరుగుప రచడంపై ఆప్ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కేజ్రీవాల్ ఓటర్లకు హామీ ఇచ్చారు.
మెుత్తం 6 ఉచిత పథకాలు కొనసాగిస్తాం.
ఉచిత విద్య, వైద్యం, మహిళలకు బస్సు ప్రయాణం, నీరు, విద్యుత్ తో సహా కొనసాగుతున్న ఆరు ఉచితాలు ముందు కూడా కొనసాగుతాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. BJP vs AAP మేనిఫెస్టో చర్చ మరోవైపు ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో మూడో భాగాన్ని శనివారం విడుదల చేసింది.
బిజెపి(BJP) అధికారంలోకి వస్తే 1,700 అనధికార కాలనీలలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని, మూడేళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఆయు ష్మాన్ భారత్ పథకం కింద రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను కూడా బిజెపి హామీ ఇచ్చింది.