Friday, September 20, 2024
HomeతెలంగాణBRS leaders consoled Lakshma Reddy: లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ

BRS leaders consoled Lakshma Reddy: లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ

శ్వేత రెడ్డికి అశ్రునివాళి

మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి ఏకాదశ దినకర్మను లక్ష్మారెడ్డి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో నిర్వహించారు. చర్లకోల శ్వేతా రెడ్డి ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి లతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు తదితరులు హాజరై లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ, స్వరణ్ రెడ్డి, రోష్ని, స్ఫూర్తి, సుజిత్ రెడ్డి, స్థోత్ర, స్థైర్యా, దయాకర్ రెడ్డి, చర్లకోల కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News