Saturday, July 27, 2024
HomeతెలంగాణAllagadda: బి ఫారం అందుకున్న భూమా అఖిలప్రియ

Allagadda: బి ఫారం అందుకున్న భూమా అఖిలప్రియ

బీ ఫారం అందుకున్న బైరెడ్డి శబరి

ఆళ్లగడ్డ నియోజకవర్గం శాసన సభస్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా అఖిలప్రియ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బి ఫారం అందుకున్నారు. అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో ఎన్నికల్లో విజయం కోసం దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని అభ్యర్థి స్వయంగా పర్యటించాలని చంద్రబాబు తెలిపారు. తాను, లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ప్రచారానికి వస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి కూడా బి ఫారం అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News