Sunday, November 16, 2025
HomeతెలంగాణChegunta: పేద కుటుంబాలకు దశదినకర్మకు ఆర్థిక సాయం

Chegunta: పేద కుటుంబాలకు దశదినకర్మకు ఆర్థిక సాయం

చేగుంట మండల కేంద్రంలో గత పది రోజుల క్రితం ఒకే రోజు ఇద్దరు సఫాయి కార్మికులు చనిపోయారు. రెండు రోజుల తర్వాత గడ్డమీది లక్ష్మి మరణించింది. సఫాయి కార్మికులు ఎర్ర పెద్ద లచ్చవ్వ ఎర్ర దుర్గయ్య వీరు మరణించిన విషయం తెలుసుకొని చేగుంట వాస్తవ్యుడు సామాజిక సేవకుడు మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిత పరంజ్యోతి ఆ మూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక క్వింటాల్ బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణ కేంద్రంలో ప్రతి బీదవాడికి తన వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి చిట్టబోయిన వెంకటేశం సిద్ధి రాములు వంజరి రవి కట్ట శ్రీనివాస్ సోమ సత్యనారాయణ అయిత రఘురాంలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad