Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: బాధితుడికి ఆర్థిక సాయం

Garla: బాధితుడికి ఆర్థిక సాయం

పేదలూ.. భయపడకండి అంటున్న నేత

గార్ల మండల కేంద్రంలోని స్థానిక చేపల మార్కెట్ బజార్ కు చెందిన కొండ రాజశేఖర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ రాజశేఖర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్య చికిత్స నిమిత్తం 5,000 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు.

- Advertisement -

ఎల్లప్పుడూ అండగా ఉంటానని శేఖర్ కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 5-10 లక్షల వరకు పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి భరోసా కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాష, ఇమ్రాన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News