Wednesday, September 18, 2024
HomeతెలంగాణHyd: గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయి

Hyd: గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయి

గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని మారు మూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తన ఛాంబర్ లో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీకేరి లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రజలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తప్పిదాలు జరగవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలకు బ్రేక్ పడిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి’తో పేద ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని స్పష్టం చేశారు.చెంచు చిన్నారులు, కిశోర బాలికల సంక్షేమంతోపాటు వారికి పౌష్టికాహారం అందించే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘గిరి పోషణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. వారిలో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ మరింత సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు.
అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్ళేవిధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు లేని పిల్లలకు మరింత పట్టిష్టమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News