తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారులు(IAS Transfers) బదిలీ అయ్యారు. కొన్ని రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎస్ యోగితా రాణా (Yogitha Rana) విద్యా శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర మోహన్(Surendra Mohan) రవాణా శాఖ కమిషనర్గా ట్రాన్సఫర్ అయ్యారు. ఇక మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ (N Sridhar)ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanthi Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.