కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/ca0a363a-b12d-4a01-b4d2-afdf4ead866e-1024x415.jpg)
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/6d06679b-6bfc-4605-bd74-1bf8048d57c9-1024x374.jpg)
అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/be80bd68-198a-4014-8996-104f687a7332-1024x414.jpg)
దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్ లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/de1e7314-2787-48fa-9d37-c66d60be5519-1024x373.jpg)