Saturday, May 18, 2024
HomeతెలంగాణKarimnagar: గోమాత దీవెనలు ఎప్పటికీ ఉండాలి

Karimnagar: గోమాత దీవెనలు ఎప్పటికీ ఉండాలి

నామినేషన్ వేసే ముందు..

గోమాత దీవెనలు ఎప్పటికీ ఉండాలని, పద్మనాయక గోశాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల పూజలు చేశారు. కరీంనగర్ ప్రజలకు గోమాత దీవెనలు ఎప్పటికీ ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావ్ సతీసమేతంగా పూజలు చేశారు. తన నామినేషన్ పురస్కరించుకొని ఇరుకుల్ల గ్రామంలోని పద్మనాయక గోశాలలో గోవులకు రాజేందర్ రావు దంపతులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు రాజేంద్ర రావు దంపతులకు స్వాగతం పలికారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అశోకరావు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News