Friday, April 18, 2025
HomeతెలంగాణKolcharam: కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలి

Kolcharam: కొత్త గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి మెమోరాండం

కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ నుంచి ఎస్సీ కాలనీ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కలిసి మెమోరాండం అందజేశారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, తమ కాలనీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తే అందరం కలిసి పట్టుదలతో అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. అందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాలనీకి చెందిన దుర్గయ్య, నరసయ్య, శ్రీనివాస్, దుర్గయ్య, కిషనయ్య, యాదయ్య, సామెల్, సుధాకర్, కిరణ్, ఏగొండ, సమీర్, రమేష్, అరుణ్ కుమార్, విజయ్, కుమార్, ప్రవీణ్, శ్రావణ్, సతీష్, వంశీ, శేఖర్, ఇసాక్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News