Friday, September 20, 2024
HomeతెలంగాణKukatpally: కార్యకర్తలతో మాధవరం ఆత్మీయ సమ్మేళనం

Kukatpally: కార్యకర్తలతో మాధవరం ఆత్మీయ సమ్మేళనం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.  మూసాపేట్ లోని రాయల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. మూసాపేట్ డివిజన్ ను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఎటు వెళ్ళాడో అని ఆయన సెటైర్లు వేశారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలిపేటట్లు చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. మూసాపేట్ డివిజన్లో ఎక్కువగా నివసించే శ్రీకాకుళం ఒరిస్సా ప్రాంత వాసులను తమ బిడ్డలలాగే పరిగణించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.  ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల సమస్యను పరిష్కరించి వారి కండగా ఉంటున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ స్థలం కేటాయిస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, పగుడాల బాబురావు, నరేంద్ర చారి, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ప్రభాకర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News