Sunday, July 7, 2024
HomeతెలంగాణKumurambhim: జిల్లాలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో శంభీపూర్ రాజు

Kumurambhim: జిల్లాలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో శంభీపూర్ రాజు

రాష్ట్రాభివృద్ధిని వివరించిన శంభీపూర్ రాజు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్సీ వివరించారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ హేమంత్ భోర్కడే, ఎస్పీ సురేష్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డి. వేణు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News