Friday, September 20, 2024
HomeతెలంగాణMadhavaram: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే మాధవరం

Madhavaram: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే మాధవరం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ లోని భువన విజయం గ్రౌండ్ వద్ద ” భువన విజయం క్రికెట్ లీగ్ 2023″ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ప్రసాదిస్తాయని, యువత క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడలను ప్రోత్సహించే విధంగా కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక పార్కులు క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్ షటిల్ కోర్ట్ నిర్మాణాలు చేపట్టామని ఇవన్నీ పిల్లలు పెద్దలు అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News