Thursday, July 4, 2024
HomeతెలంగాణMoinabad: మొయినాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు

Moinabad: మొయినాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు

హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితర ప్రజాప్రతినిధులు మొయినాబాద్ మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలలో వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల నిర్మాణాలకు గాను శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలోని నాగిరెడ్డి గూడ, బాకారం, అమ్డపూర్, ముర్తుజుగూడా, పెద్ద మంగళరం తదితర గ్రామాలలో రోడ్డు వెడల్పు, పలు గ్రామాలలో నూతన రోడ్ల నిర్మాణం పనులకుగాను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించారు. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శంకుస్థాపనలు చేసిన పలుచోట్ల రోడ్లన్నీ నీటి కుంటలుగా తలపించాయి. ఆయా గ్రామాల సర్పచులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ మంత్రులు, ఎంపి, ఎమ్మేల్యేలు కొంత ఇబ్బందికి గురయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రారంభించిన పలు ప్రజా కార్యక్రమాలతో ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా నియోజక వర్గ ప్రజల శ్రేయస్సు కోరి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అధినాయకులు ప్రారంభోత్సవాలతో సరిపెట్టకుండా.. వారి పర్యవేక్షణలో పనులు పూర్తి గావించిన రోజున పాలాభిషేకం చేయనున్నామని మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపిపి నక్షత్రం జయవంత్, జెడ్పీటిసి కాలే శ్రీకాంత్, అమ్డపూర్ సర్పంచ్ బూర్గు రవళి గోపి కృష్ణారెడ్డి, ముర్తుజగుడ సర్పంచ్ చప్పిడి మానెమ్మ, బాకారం సర్పంచ్ రాఘవరెడ్డి, పెద్దమంగలారం సర్పంచ్ నరోత్తం రెడ్డి, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ నాయకులు అనంత్ రెడ్డి, శ్రీహరి యాదవ్, మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు జయవంత్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రావుఫ్, మాజీ ఉపాద్యక్షుడు డప్పు రాజు, సామ రవీందర్ రెడ్డి, సైపాల్ రెడ్డి, మండల బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు పూసల పరమేష్, కిరణ్, సునీల్, అలురి రమేష్, కర్రోల్ల భాస్కర్ పలు గ్రామాల సర్పంచ్లు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News