Sunday, July 7, 2024
HomeతెలంగాణShankarpalli: ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

Shankarpalli: ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

పలు కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్న ఎమ్మెల్యే

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో 8వ వార్డ్ ఫతేపూర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

- Advertisement -

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కలసి కాలే యాదయ్యను శాలువతో ఘనంగా సత్కరించి వినాయకుని ఫోటోను స్థానిక కౌన్సిలర్ జొన్నాడ రాములు చేతుల మీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధర్మన్న గారి వెంకటరెడ్డి , స్థానిక కౌన్సిలర్ జొన్నాడ రాములు , అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కాడి గళ్ళ శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో మునగాల సుధాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.

శ్రీ వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ హనుమంత్ రెడ్డి పుట్టినరోజు కావడంతో స్వీటు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థి దశ లోనే మానవుని ఎదుగుదల సక్రమంగా సాగడానికి విద్యార్థి దశలోనే ప్రారంభమవుతుందని , విద్యార్థులు మంచి క్రమశిక్షణతో కష్టపడి కాదు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు గుర్తింపు తేవాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ భానూరి వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు,7వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్ , జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మోహిన్ పాషా,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లెక్చరర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News