Monday, July 8, 2024
HomeతెలంగాణTanduru: మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమాళ్ పై కేసు

Tanduru: మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమాళ్ పై కేసు

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం శివాజీ జయంతి సందర్భంగా శివాజీ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో నేతల మధ్యన స్వల్ప ఉద్రిక్తత నెలకొన్న సమయంలో వేదికపై ఉన్న మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమాళ్, కౌన్సిలర్, మరికొందరు వ్యక్తులు పోలీసులకు సహకరించకుండా వారి విధులకు ఆటంకాలను కలిగించారని తెలిపారు. పోలీసులు డౌన్ డౌన్, డీఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్‌తో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News