Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

Mallapur: తెలుగుప్రభ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి

సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర మరువలేనిదని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా పనిచేస్తుందని టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు. తెలుగుప్రభ క్యాలెండర్, డైరీని మెట్ పల్లి లోని తన నివాసంలో సుజిత్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సుజిత్ రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసెందుకు జర్నలిస్ట్ లు ఎంతో కృషి చేస్తున్నారని, తెలుగుప్రభ దినపత్రిక మరింత ముందుకు సాగాలని, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో తెలుగుప్రభ దినపత్రిక ముందుండాలని, నిజాలను నిర్భయంగా రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుప్రభ రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోవర్ధన్, గంగాధర్, గంగా రెడ్డి, రాజేందర్, నరేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad