నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు(Chandra Babu) పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానం ద్వారా మధ్యాహ్నం 1:30కి ఢిల్లీ చేరుకుంటారు.
- Advertisement -
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఢిల్లీ పర్యటన తర్వాత తిరిగి విశాఖకు సీఎం చంద్రబాబు వస్తారు.
గురువారం దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్తారు. రేపు ఓ చానెల్ కాంక్లేవ్లో పాల్గొంటారు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు.