అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సంకరజాతి అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా విభాగం నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు(Raghurama Krishna Raju) సజ్జల వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టేలా సజ్జల మాట్లాడారని ఆరోపించారు. ఈమేరకు ఓ లేఖ రాశారు. భవిష్యత్లో ఇలాంటి అవమానకర భాష ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సజ్జల వ్యాఖ్యలు అమరావతి ప్రాంతంలోని లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమరావతి మహిళల హక్కులకు, వారి గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉంటుందన్నారు. అయితే నిరసన తెలిపే వారిపై ఈ విధమైన వ్యక్తిగత దూషణలు సహించలేనివి అన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని RRR కోరారు.
కాగా ప్రముఖ ఛానెల్ డిబేల్ లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా పలువురు మహిళలు విజయవాడలోని సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అయితే వారిని ఉద్దేశించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పిశాచాలు కూడా ఇలా చేయలేకపోవచ్చు. వారిని రాక్షసులుగా కూడా పిలవలేం. వీరంతా కలసి ఒక రకమైన సంకర తెగలా తయారయ్యారు. ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదు. పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు మహిళలపై గౌరవం లేదని.. వారు వాడే హేయమైనదని ఆగ్రహించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Raghurama Krishna Raju: సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES