Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: అత్తమ్మ కోసం రంగంలోకి కోడలు

Emmiganuru: అత్తమ్మ కోసం రంగంలోకి కోడలు

బుట్టా సాహితీ ప్రచారం

తన అత్తను గెలిపించాలంటూ నియోజకవర్గమంతా కోడలు ప్రచారంలోకి దిగింది. అత్త బుట్టా రేణుక విజయం కోసం కోడలు బుట్టా సాహితీ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రేణుక కుమారుడు బుట్టా ప్రతుల్ తల్లితో పాటుగా ప్రచారం కొనసాగిస్తుండగా కోడలు కూడా ప్రచారం చేస్తూ, స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

- Advertisement -

ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుకను గెలిపించాలని బుట్టా రేణుక కోడలు బుట్టా సాహితీ కోరారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 7 వ వార్డులో బుట్టా సాహితీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని వైసిపిను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే కర్నూలు ఎంపి అభ్యర్థి బీవై రామయ్యను కూడా గెలిపించాలని అభ్యర్థించారు.

కార్యక్రమంలో కుర్ణి కౌన్సిలర్ ఎరుకల సుంకమ్మ, వైసిపి నాయకులు శివ సూర్యనారాయణ, సునీల్ కుమార్, ప్రహలాద్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News