గొనేగండ్ల మండల పరిధిలోని వీరంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బంగారు లింగమయ్య స్వామి దేవర మహోత్సవంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, కోడుమూరు ఇన్చార్జ్, కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది వర్షాలు బాగా కురిసి రైతులు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించామన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/c22dc1b5-8c17-4cf4-906d-baa2a484d1e3-1024x462.jpg)
రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అత్యంత భాజీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠం , బుట్టా ప్రతుల్,గోనెగండ్ల మండల యూత్ అధ్యక్షులు టికే బందెన నవాజ్, దొరబాబు,వీరంపల్లి గ్రామం సర్పంచ్ సుంకన్న, నాయకులు కృష్ణారెడ్డి, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/483ed1a1-5ed3-4b2e-bd25-9ac90ec71f4b-1024x462.jpg)