Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala : శ్రీవారికి రూ. 3.86 కోట్ల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం.. అపురూప కానుక సమర్పించిన...

Tirumala : శ్రీవారికి రూ. 3.86 కోట్ల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం.. అపురూప కానుక సమర్పించిన పువ్వాడ దంపతులు

- Advertisement -

Tirumala : విశాఖపట్నానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందుస్థాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎండీ పువ్వాడ మస్తాన్‌రావు దంపతులు తమ అచంచలమైన భక్తిని చాటుకున్నారు. వారి సతీమణి కుంకుమరేఖతో కలిసి శ్రీవారికి రూ. 3.86 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని విరాళంగా సమర్పించారు. ఈ విలువైన కానుక తిరుమల చరిత్రలో ఓ అరుదైన ఘట్టంగా నిలిచింది.

3.860 కిలోల స్వర్ణం, వజ్రాల కాంతి

స్వామివారికి సమర్పించిన ఈ యజ్ఞోపవీతం సాధారణమైంది కాదు. దీని తయారీలో ఏకంగా 3.860 కిలోల స్వచ్ఛమైన బంగారం వాడారు. అంతేకాకుండా, ఈ స్వర్ణ యజ్ఞోపవీతం మెరుపును మరింత పెంచడానికి అత్యంత నాణ్యమైన వజ్రాలను పొదిగారు. ఈ అద్భుతమైన ఆభరణం తయారీ వెనుక దాతల భక్తితో పాటు, అత్యున్నత కళా నైపుణ్యం కూడా దాగి ఉంది. ఈ విలువైన కానుక శ్రీవారి వైభవాన్ని, దివ్యత్వాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది.

మహాద్వారం వద్ద అర్పణ

బుధవరం రోజున, మస్తాన్‌రావు, కుంకుమరేఖ దంపతులు ఈ బంగారు యజ్ఞోపవీతాన్ని శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ, ఈ అపురూప కానుక సమర్పణ భక్తులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారు టీటీడీ ఛైర్మన్బి.ఆర్‌. నాయుడు గారిని కలిసి యజ్ఞోపవీతాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా దాతల దాతృత్వానికి టీటీడీ ఛైర్మన్‌ నాయుడు కృతజ్ఞతలు తెలియజేసి, వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. దైవ కార్యాలకు తమవంతు సహకారం అందించిన మస్తాన్‌రావు దంపతులను బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్‌రెడ్డి, నరేశ్‌ కుమార్, శాంతారామ్‌ తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad